కాంగ్రెస్ సర్కార్ ఎంత చెప్పినా.. అవి మోదీ బియ్యమే: బండి సంజయ్

కాంగ్రెస్ సర్కార్ ఎంత చెప్పినా.. అవి మోదీ బియ్యమే: బండి సంజయ్

హైదరాబాద్:  తెలంగాణలోని రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తోన్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ ఫొటో ఉన్న ఫ్లెక్సీలు పెడితే చింపుతున్నారని ఫైర్అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ ఎంత చెప్పినా.. అవి మోదీ బియ్యమే అని స్పష్టంచే శారు. 

నాంపల్లిలో పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన.. రేషన్ బియ్యం ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం మోదీదే. అయినప్పటికీ సన్న బియ్యం పేరుతో వీధినాటా లడే కళాకారులను మైమరపించేలా కాంగ్రెస్ నేతల డ్రామాలాడుతున్నరు. వడ్ల కొనుగోలు పేరుతో కేంద్రం ఏటా సగటున రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇవిగాక రవాణా, మిల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ ఛార్జీలతోపాటు మితీతో సహా వడ్ల పైసలు చెల్లిస్తోంది. ఈ లెక్కన ఒక్క కిలో బియ్యానికి రూ.37లు ఖర్చు చేస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానిదే. తక్షణమే రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫొటో పెట్టాల్సిందే. మోదీ బియ్యం తీసుకుంటున్న పేదల ఇండ్ల వద్దకు వెళ్లి భోజనం చేసి సమస్యలు తెలుసుకోవాలని బీజేపీ మండలాధ్యక్షులకు పిలుపునిచ్చారు బండి సంజయ్.

 హెచ్ సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ అమానుషంగా వ్యవహరించింది. ప్రభుత్వ తీరును వ్యతిరేకించిన యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ పై దాడి చేసి జైలుకు పంపుతారా? రెండు పార్టీలు కలిసి భావితరాలకు గజం జాగా లేకుండా చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆ ర్ఎస్ పోటీపడి హైదరాబాద్ ను మజ్లిస్ కు అప్పగించేందుకు సిద్ధమైనయ్. ఓటేయబోయే హైదరాబాద్ కార్పొరేటర్లరా.. దేశభక్తి పార్టీ అభ్యర్ధికి ఓటేస్తారా?. దేశద్రోహ పార్టీకి ఓటే స్తారా? ఆలోచించండి' అని బండి సంజయ్ అన్నారు.