తుర్కాసిపల్లి నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

తుర్కాసిపల్లి నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ‘ ప్రజా సంగ్రామ పాదయాత్ర’ ఇవాళ గంగాధర మండలం తుర్కాసిపల్లి నుంచి కొనసాగనుంది. గంగాధర ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించే రోడ్ షోలో బండి సంజయ్ ప్రసంగించనున్నారు.17వ రోజు కొత్తపల్లి మండల హెడ్ క్వార్టర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. రేపటితో బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగియనుంది. రేపు మధ్యాహ్నం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ లో ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరుకానున్నారు. 

బండి సంజయ్ ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు

‘ప్రజా సంగ్రామ యాత్ర’ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. రామడుగు మండలం వెదిరలో బండి సంజయ్  ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేవాలయాల అభివృద్ధిలో బండి సంజయ్ పాత్ర ఏంటో చెప్పాలంటూ ఫ్లెక్సీలో డిమాండ్ చేసి ఉంది. దేవాలయాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు మంజూరు చేయించావో భక్తులకు చెప్పాలని ఉంది. ఇవాళ వెదిర మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ను ప్రశ్నిస్తూ.. అదే రూట్లో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.