గండిపేట్,వెలుగు: బండ్లగూడ జాగీరు మేయర్ మహేందర్గౌడ్పై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్రెడ్డి సమక్షంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. మేయర్ తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు హాజరుకాలేదు. ఓటింగ్లో మేయర్కు వ్యతిరేకంగా16 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. దీంతో మేయర్ మహేందర్గౌడ్ తన పదవిని కోల్పోయారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్కు సన్నిహితుడైన మేయర్ ఇప్పటికే తన కార్పొరేటర్లు, అనుచరులతో కాంగ్రెస్ లో చేరారు.
అయితే.. తన వ్యూహాలను అమలు చేసేందుకు యత్నించినా అవి ఏమీ కొనసాగలేదు. మేయర్ మహేందర్గౌడ్పై వ్యతిరేకతతోనే మొత్తం 22 మంది కార్పొరేటర్లలో 16 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పటికే కొత్త మేయర్గా లతా ప్రేమ్గౌడ్కు కార్పొరేటర్లు మద్దతు పలుకుతుండగా.. త్వరలో జరిగే మీటింగ్ లో ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.