హాస్పిటల్ లో ఉన్న బాధితులు ఎటుపోయారో తెల్వదు

హాస్పిటల్ లో ఉన్న బాధితులు ఎటుపోయారో తెల్వదు

జూబ్లీహిల్స్  కారు ప్రమాద ఘటనపై  పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఉన్నాడన్నారు. అఫ్నాన్, రహీల్, మహమ్మద్ మాజ్ అనే ముగ్గురు  యువకులు కారులోనే ఉన్నారన్నారు. ప్రమాద సమయంలో అఫ్నాన్ కారు డ్రైవ్ చేశాడన్నారు. అఫ్నాన్ ను అరెస్ట్ చేశామన్నారు. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం వల్లే  ప్రమాదం జరిగిందన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ఎక్కడికి వెళ్లారో తెలియదన్నారు. బిల్లు కట్టే వారు ఎవరు లేకపోవడంతో బాధితులను అపోలో నుండి నిమ్స్ కు తరలించామన్నారు. బాధితులు బాబు డెడ్ బాడిని తీసుకుని ఊరికి వెళ్లిపోయారన్నారు. రహీల్ ఎక్కడున్నాడో తమకు తెలియదన్నారు.దర్యాప్తు కోసం నాలుగు టీంలను ఏర్పాటు చేశామని.. వంద కెమెరాలు జల్లెడ పట్టామన్నారు.