బంజారాలకు మంత్రి పదవి ఇయ్యాలి.. బంజారా గిరిజన సంఘాల జేఏసీ

బంజారాలకు మంత్రి పదవి ఇయ్యాలి.. బంజారా గిరిజన సంఘాల జేఏసీ

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గంలో బంజారాలకు అవకాశం కల్పించాలని బంజారా గిరిజన సంఘాల జేఏసీ నాయకులు డా. వెంకటేశ్ చౌహన్ , డా. రాజేశ్ నాయక్ విజ్ఞప్తి చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం  (June 12)ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. 

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి లంబాడీలు కీలక పాత్ర వహించారన్నారు. ఎస్టీకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం పట్ల తమ సామాజిక వర్గం సంతోషంగా లేదని, మంత్రి పదవి ఇస్తే తమ సమస్యలను చెప్పుకొనే అవకాశం ఉంటుందన్నారు. 

కాంగ్రెస్ అధిష్ఠానంపై తమకు నమ్మకం ఉందని.. మిగిలిన వాటిలో ఎస్టీలకు అవకాశం కల్పిస్తారని ఆశాభా వం వ్యక్తం చేశారు. త్వరలో హైదరాబాద్ లో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్తీక్ నాయక్ , శ్రీమాన్  నాయక్ పాల్గొన్నారు.