U19 World Cup 2024: అండర్19 ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఉదయ్ సహారన్

U19 World Cup 2024: అండర్19 ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఉదయ్ సహారన్

వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్ 19 ప్రపంచ కప్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టుకు పంజాబ్ యువ బ్యాటర్ ఉదయ్ సహారన్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ దక్కించుకున్నాడు. కర్ణాటక మాజీ వికెట్ కీపర్ తిలక్ నాయుడు నేతృత్వంలోని భారత జూనియర్ సెలక్షన్ ప్యానెల్ ఈ జట్టును ఎంపిక చేసింది.

ప్రస్తుతం దుబాయ్‌ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్‌ జట్టుకు ఉదయ్ సహారన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రపంచ కప్‌కు ముందు డిసెంబర్ 29 నుండి జనవరి 10 వరకు ఆతిథ్య దక్షిణాఫ్రికా మరియు ఇంగ్లండ్‌లతో భారత యువ జట్టు ట్రై సిరీస్ ఆడనుంది. ఈ టోర్నమెంట్ లో ఇదే జట్టును కొనసాగించారు.

అండర్19 ప్రపంచ కప్‌కు భారత జట్టు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్ ), అరవెల్లి అవనీష్ రావు (వికెట్ కీపర్), సౌమ్య్ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్ కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.

ట్రై సిరీస్ కోసం రిజర్వ్ ప్లేయర్లు: ప్రేమ్ దేవ్‌కర్ అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్.
బ్యాకప్ ప్లేయర్లు: దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి విఘ్నేష్, కిరణ్ చోర్మలే.