న్యూఢిల్లీ: ఇండియా–ఆస్ట్రేలియా మూడో టెస్టు వేదికను బీసీసీఐ మార్చే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 1 నుంచి 5 వరకు ఈ టెస్టు ధర్మశాలలో జరగాల్సి ఉంది. అయితే, చాన్నాళ్ల నుంచి కాంపిటీటివ్ మ్యాచ్కు ధర్మశాల ఆతిథ్యం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టెస్టు మ్యాచ్కు ఔట్ ఫీల్డ్ రెడీగా లేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. బీసీసీఐ క్యురేటర్ తపోశ్ ఛటర్జీ ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియానికి వెళ్లి పిచ్, ఔట్ ఫీల్డ్ పరిశీలించాడు. అతను రిపోర్టు ఇచ్చిన తర్వా బీసీసీఐ పెద్దలు తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ స్టేడియానికి కేటాయించిన చివరి రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్లు వర్షం వల్ల రద్దయ్యాయి. ధర్మశాల నుంచి మ్యాచ్ను షిఫ్ట్ చేయాలని నిర్ణయిస్తే బెంగళూరు లేదా వైజాగ్కు దీన్ని కేటాయించే అవకాశం ఉంది.