దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో IPL మ్యాచ్ లు దేశంలోనే జరుగుతాయా.. ఎక్కడ జరుగుతాయనేదానిపై BCCI అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ మరోసారి స్పష్టతనిచ్చారు. అయితే BCCI-2022 ఇండియాలో జరుగుతుందని తెలిపారు. కరోనా పరిస్థితి చేయిదాటితే తప్ప ఈ సారి ఐపీఎల్ను ఇండియాలోనే నిర్వహిస్తామని తెలిపారు. ముంబై, పూణెలలో లీగ్ మ్యాచ్లను జరుపుతామని… అహ్మదాబాద్ వేదిక గురించి ఇంకా ఆలోచించలేదని తెలిపాడు. ఏప్రిల్, మే నెలల్లో ఇండియాలో కరోనా కేసుల ఉధృతి ఎలా ఉంటుందో చూసి.. పరిస్థితులకు అనుగుణంగా తాము IPL నిర్వహణలో మార్పులపై నిర్ణయం తీసుకుంటామని గంగూలీ తెలిపాడు. కరోనా కారణంగా గత రెండు సీజన్లను UAE వేదికగా నిర్వహించారు. దుబాయ్, అబుదాబీ, షార్జా వేదికలలో మ్యాచ్లను ఏర్పాటు చేశారు. ఆటగాళ్లు, సిబ్బంది బయోబబుల్ ఉంటూ ఐపీఎల్ ఆడాల్సి వచ్చింది.
మరిన్ని వార్తల కోసం...