బీటెక్, బీఎస్సీ పాసైతే చాలు.. బెల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు

బీటెక్, బీఎస్సీ పాసైతే చాలు.. బెల్లో  ప్రాజెక్ట్ ఇంజినీర్  పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ప్రాజెక్ట్ ఇంజినీర్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 20. 

పోస్టుల సంఖ్య: 52 (ప్రాజెక్ట్ ఇంజినీర్ I )
పోస్టులు: ఎలక్ట్రానిక్స్ 40, కంప్యూటర్ సైన్స్ 08, మెకానికల్ 04. 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ/ బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పని విభాగంలో కనీసం రెండేండ్ల పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 32 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 
అప్లికేషన్లు ప్రారంభం: నవంబర్ 10.  
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.472. 
లాస్ట్ డేట్: నవంబర్ 20. 
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 24. ఆసక్తి గల అభ్యర్థులు 20న నవంబర్ రాత్రి 11.00 గంటల లోపు క్యూఆర్ కోడ్ ద్వారా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కోసం ముందస్తుగా నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోని అభ్యర్థులను ఇంటర్వ్యూకు అనుమతించరు.  
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు bel-india.in  
వెబ్​సైట్​లో సంప్రదించగలరు.