స్టేషన్ బెయిల్ కు లక్ష డిమాండ్ చేసిన బెల్లంపల్లి ఎస్సై

స్టేషన్ బెయిల్ కు లక్ష డిమాండ్ చేసిన బెల్లంపల్లి ఎస్సై

మంచిర్యాల జిల్లా: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు బెల్లంపల్లి ఎస్సై భాస్కర్ రావు. బుధవారం ఓ కేసు విషయంలో బెల్లంపల్లి 2టౌన్ పోలీసు స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసిబి అధికారులు. ఓ కేసులో స్టేషన్ బెయిలు ఇవ్వడానికి రూ 1.20 లక్షల లంచం డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని కలిశారు. దీంతో పక్కా ప్లానింగ్ తో ఎస్సై భాస్కర్ రావును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.