- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీవో ఆఫీసు ముందు లబ్ధిదారుల ఆందోళన
హుస్నాబాద్, వెలుగు : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి ఏడు నెలలు కావస్తున్నా ఇవ్వకపోవడంతో పలువురు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఆర్డీవో ఆఫీసు ముందు ధర్నా చేశారు. డబుల్ బెడ్రూమ్ఇండ్ల కోసం డ్రా తీసి ఏడు నెలలైనా ఇండ్లు ఎందుకు ఇస్తలేరో ఆఫీసర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత ఇండ్లు లేకపోవడంతో అద్దె ఇండ్లలో ఉంటున్నామని, నెలనెలా కిరాయి కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లను అడిగినా సమాధానం చెప్పడంలేదన్నారు. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తామంటే లీడర్లు అడ్డుకుంటున్నారన్నారు.
వైఎస్సార్టీపీ హుస్నాబాద్ నియోజకవర్గ కో ఆర్డినేటర్అయిలేని మల్లికార్జునరెడ్డి, కిసాన్సంఘ్జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, బీసీ సంఘంనాయకుడు రవీందర్వచ్చి బాధితులకు మద్దతుగా ఆందోళన చేశారు. లబ్ధిదారులకు డబుల్బెడ్రూమ్ఇండ్లు ఎందుకు ఇవ్వడంలేదో ఆర్డీవో వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా కదిలేది లేదన్నారు. ఆర్డీవో రాకపోవడంతో తహసీల్దార్కు వినతిపత్రాన్ని ఇచ్చారు. రెండు రోజుల్లో లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించి వెళ్లిపోయారు.