మోడీ మీటింగ్‌కు మమత హాజరు కావడం లేదు?

మోడీ మీటింగ్‌కు మమత హాజరు కావడం లేదు?
  • స్పీకర్స్‌ లిస్ట్‌లో కనిపించని పేరు

న్యూఢిల్లీ: అన్‌లాక్‌ – 1 తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోడీ నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్‌లో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పాల్గొనడం లేదని తెలుస్తోంది. బుధవారం జరిగే ఈ మీటింగ్‌ స్పీకర్స్‌ లిస్ట్‌లో ఆమె పేరు లేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. కాగా.. ఈ విషయంపై స్పందించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు మీటింగ్‌కు అటెండ్‌ అవ్వాలా లేదా అనే విషయంపై ఇంకా డిసైడ్‌ అవ్వలేదని అన్నారు. “ మీటింగ్‌కు అటెండ్‌ అయినా కూడా మాట్లాడ నివ్వరని మీటింగ్‌కు అటెండ్‌ అవ్వాల్సిన అవసరం ఏమి ఉందని” పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. అన్‌లాక్‌ –1 రెండు వారాలు కావడంతో మంగళవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాగా.. రెండో విడతలో ఈ రోజు మరికొంత మందితో నిర్వహించనున్నారు.