
బెంగాలీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాలీ సీనియర్ దర్శకుడు ఉత్పలేందు చక్రవర్తి (Utpalendu Chakraborty)(76) తుదిశ్వాస విడిచారు. మంగళవారం (ఆగస్ట్ 20) సాయంత్రం రీజెంట్ పార్క్లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఉత్పలేందు చక్రవర్తి గత కొద్ది సంవత్సరాలుగా సీవోపీడీతో (CPOD) బాధపడుతున్నారు.
అంతేకాకుండా గత ఏప్రిల్ నెలలో అకస్మాత్తుగా బాత్రూంలో పడిపోవడంతో ఫ్రాక్చర్ అయింది. దానికి ఆయన సర్జరీ కూడా చేయించుకున్నారు. ఇక నెమ్మదిగా కోలుకునే ప్రక్రియ మొదలవ్వగానే ఇలా ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించారు.కాగా ఆయన మృతికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. చక్రవర్తి మృతితో సినీ పరిశ్రమలో తీరని లోటని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అలాగే, దేశంలోని పురాతన ఫిల్మ్ క్లబ్లలో ఒకటైన సినీ సెంట్రల్ చక్రవర్తి మృతికి సంతాపం ప్రకటించింది.ఆయనకు ఇద్దరు కుమార్తె రీతాభరి, చిత్రాంగద, భార్య సతరూప సన్యాల్ ఉన్నారు.
ఇక ఆయన సినిమా ప్రస్థానికి వస్తే..1981 సంవత్సరంలో తన తొలి చిత్రానికే ఇందిరా గాంధీ ప్రఖ్యాత అవార్డు వరించింది. 1983లో చోఖ్ చిత్రానికి ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. NFDC అవార్డు మరియు రాష్ట్రపతి అవార్డును కూడా పొందాడు. ఆయన తన కెరీర్లో మోయన్తాడంటో (1980), చందనీర్ (1989), ఫాన్సి (1988), దేబ్శిశు (1987) చిత్రాల్లో సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. ఆయన స్కాటిష్ చర్చి కళాశాల, కలకత్త విశ్వవిద్యాలయాల్లో చదివారు. సత్యజిత్ రే, రవీంద్ర సంగీత్, దేబబ్రత బిస్వాస్ వంటి పలు డాక్యుమెంటరీలను రూపొందించారు.