RCBకి కప్ రావడంతో కస్టమర్లకు చాక్లెట్లు పంచి సెలబ్రేట్ చేసిన క్యాబ్ డ్రైవర్

RCBకి కప్ రావడంతో కస్టమర్లకు చాక్లెట్లు పంచి సెలబ్రేట్ చేసిన క్యాబ్ డ్రైవర్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టోర్నీ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో కర్ణాటక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకు తమ రాష్ట్రానికి ప్రీమియర్ లీగ్స్ లో ఒక కప్పు కూడా లేదని బాధ పడుతున్న జనాలకు ఒక్కసారిగా ఉమెన్స్ కప్ మంచి బూస్టునిచ్చింది. RCB అభిమానులు బెంగళూరు నగర వీధుల్లో గుమికూడి ఇన్నేళ్ల తమ కల సకారం అయ్యిందని టపాసులు పేల్చి కేరింతలు కొట్టి సెలబ్రేట్ చేసుకున్నారు.  

అందరూ అలాగే సెలబ్రేట్ చేస్తే కిక్ ఏముంటుందని అనుకున్నాడో ఏమో కానీ ఓ క్యాబ్ డ్రైవర్ మాత్రం వినూత్నంగా బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. స్వతహాగా ఆర్సీబీ అభిమాని అయిన క్యాబ్ డ్రైవర్ తన కారులో ఎక్కిన వారికి చాక్లెట్లు పంచి సెలబ్రేషన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలోకి ఓ వ్యక్తి వదిలి ఈ విధంగా క్యాప్షన్ ఇచ్చాడు.

“ఈ రోజు ఉదయం నమ్మ బెంగళూరులో క్యాబ్‌లోకి వెళ్లి క్యాబ్ డ్రైవర్ నుండి ఈ చాక్లెట్ తీసుకున్నాను! అతను ఈ రోజు తన కస్టమర్లందరికీ చాక్లెట్లు ఇస్తున్నాడు! ఎందుకంటే RCB గెలిచింది. టీం అభిమానుల ప్రేమ మరవలేనిది”  అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటోలు చూసిన నెటీజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.  “RCB అభిమానులు నిజంగా అద్భుతంగా ఉన్నారు” అని ఒకరంటే మరొకరు "కర్ణాటకకు గర్వకారణం" అని కామెంట్ చేస్తున్నారు.