పిల్లలు చిన్న ,చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకోవడం.. తల్లిదండ్రులకు బాధను మిగిల్చడం వంటి విషాదకర సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సెల్ ఫోన్ చూడనివ్వలేదని ఒకరు.. సెల్ ఫోన్ కొనివ్వలేదని మరొకరు.. కాదన్నందుకు ఇంకొకరు.. ఇలా చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజా అలాంటిదే ఓ ఘటన న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జరిగింది. తల్లిదండ్రులు ఫోటోషూట్ వద్దన్నందుకు కూతురు ఆత్మహత్య చేసుకుంది.వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు చెందిన బీబీఏ విద్యార్థిని ఫొటోగ్రఫీ కోర్సు చేసింది. ఆదివారం (డిసెంబర్ 31)న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఫొటో షూట్ కు తల్లిదండ్రులను పర్మిషన్ అడిగింది. వారు నిరాకరించడంతో 21 యేళ్ల వర్షిణి గదిలో ఆత్మహత్య చేసుకుంది.
బెంగళూరులోని సుధామనగర్ లో నివాసముంటున్న విద్యార్థిని వర్షిణి ఆదివారం తన గదిలో శవమై కనిపించడంతో పోలీసులు సమాచారం అందించారు. వర్షిణి ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేసిందని.. కొత్త సంవత్సరం సందర్భంగా ఓ మాల్ లో తన ఫొటోషూట్ చేయడానికి ఆమె తల్లిదండ్రులను అనుమతి కోరిందని వారు నిరాకరంచడంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వర్షిణీ మృతదేహాన్ని పోస్ట్ మార్ట మ్ నిర్వహించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. మాకు ఎటువంటి సూసైడ్ నోటీ అందలేదు.. కానీ ఆమె ఈ సంఘటనకు ముందుకు చేసిన ఫోన్ మేసేజ్ లను పరిశీలిస్తున్నాం.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.