- జోగులాంబ, బనగానపల్లె, యాగంటి, మహానందికి స్పెషల్ ప్యాకేజీ
- కుషాయిగూడ డిపో నుంచి మార్చి 6న యాత్ర
హైదరాబాద్ సిటీ, వెలుగు: పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం కుషాయిగూడ డిపో ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. జోగులాంబ, బనగానపల్లె, యాగంటి, మహానంది క్షేత్రాలను సందర్శించేందుకు మార్చి 6న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరనున్నది. ఈ పుణ్యక్షేత్రాల యాత్రకు టికెట్ ధర రూ.1,800గా నిర్ణయించారు. టికెట్ బుకింగ్ కోసం 9603549388, 7382819873 నంబర్లను సంప్రదించాలన్నారు.
పండరీపూర్, తుల్జాపూర్లకు...
మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు కూడా కుషాయిగూడ డిపో నుంచి ప్రత్యేక బస్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. డిపో నుంచి మహారాష్ట్రలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి, పండరీపూర్ రుక్మిణి పాండురంగ, కొల్హాపూర్ మహాలక్ష్మి, తుల్జాపూర్ భవానీ మాతా ఆలయాలకు వెళ్లేందుకు మార్చి 6న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరనున్నది. టికెట్ ధర రూ.3,500 నిర్ణయించారు. బుకింగ్ కోసం 9603549388, 7382819873 సంప్రదించాలన్నారు.
