భద్రాచలం/ గుండాల, వెలుగు: సమన్వయంతో పని చేసి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ రెవెన్యూ, పోలీసు, దేవస్థానం, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం సబ్కలెక్టర్ ఆఫీస్లో శ్రీరామనవమి ఏర్పాట్లపై రివ్యూ మీటింగ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకల్లో వీఐపీలు, పర్యాటకులకు, భక్తులకు అన్నిరకాల సదుపాయాలు కల్పించాలన్నారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. తాగునీరు, ఆహారం, వైద్య సేవలపై ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ఆర్టీసీ సర్వీసులు, కరెంట్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టంగా చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. సెక్టార్ వారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల్లో పాల్గొనే సిబ్బందికి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తర్వాత మిథిలాస్టేడియంలో ఏర్పాట్లను వారు తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ అంకిత్ గుండాల మండలం ముత్తాపురం ఏకలవ్య స్కూల్ను సందర్శించారు. స్కూల్లో శుభ్రత లేకపోవడంతో సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండాల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి, వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు.
