జనగణనలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

జనగణనలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జనగణనలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ పేర్కొన్నారు. కలెక్టరేట్​లో మూడు రోజులుగా ఫీల్డ్​ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ శుక్రవారం ముగిసింది. జనగణనపై పాలకోయ తండా ప్రాంతంలో ప్రాక్టికల్​ డెమో నిర్వహించారు. 

ఈ ప్రోగ్రామ్​ను కలెక్టర్​ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వివరాన్ని శ్రద్ధతో నమోదు చేయాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్​లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతిలో కలెక్టర్​ పాల్గొని  నివాళులర్పించారు.