భద్రాచలం/ కామేపల్లి, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ను రాష్ట్ర గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా శనివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మార్ట్లో అటవీ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. సహజ సిద్ధమైన ఆర్గానిక్ వస్తువులతో పాటు, అటవీ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఐటీడీఏ పీవో బి.రాహుల్ను గవర్నర్ ప్రశంసించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ మార్ట్ను స్థానికులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, ఏపీవో జనరల్ డేవిడ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. కామేపల్లి మండలం ఉట్కూరుకు చెందిన డాక్టర్ సామినేని రాఘవులు ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాఘవులు కుటుంబాన్ని పరామర్శించారు. అంతకుముందు ఆయన ఫొటోకు నివాళులర్పించారు.
