సురారం బస్​స్టాప్ వద్ద గ్యాస్​ పైపు లైన్​ లీకేజీ

సురారం బస్​స్టాప్ వద్ద గ్యాస్​ పైపు లైన్​ లీకేజీ

మేడ్చల్ జిల్లా పరిధిలోని సురారం బస్​స్టాప్ వద్ద గ్యాస్​ పైపు లైన్​ లీకేజీ అయింది.  జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పుట్​పాత్ పనులు చేపడుతున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్​ పైపు లైన్ పగిలింది. జేసీబీ సహాయంతో జరుగుతున్న పనుల్లో భూమిలో ఉన్న భాగ్యనగర్ గ్యాస్ పైపు లైన్ పగిలింది. పెద్ద ఎత్తున శబ్దంతో గ్యాస్ లీకేజీ కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. 
ఏం జరిగిందో అర్థం కాక అయోమయ పరిస్థితి ఏర్పడగా.. గ్యాస్ పైప్ లైన్ లీకేజీ అయిందన్న విషయం తెలిసి పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రధాన లైన్ కావడంతో సమాచారం అందుకున్న సంబంధిత సిబ్బంది గ్యాస్​ను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలు అటువైపు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

 

ఇవి కూడా చదవండి

కంప్లైంట్ ఇచ్చిన సారే.. బ్రిడ్జి దొంగతనం చేసిండు..

ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం

రామయ్య పట్టాభిషేకంలో గవర్నర్‌ను పట్టించుకోని అధికారులు