- బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు జీవో 46తో అన్యాయం జరుగుతుందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ పేర్కొన్నారు. కానిస్టేబుల్ పోస్టుల్లో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు 53శాతం రిజర్వేషన్ కల్పించి, మిగిలిన జిల్లాలకు 47శాతం కేటాయించడంతో అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు.
శుక్రవారం భానుప్రకాశ్ను పోలీస్ రిక్రూట్మెంట్ – 2022 అభ్యర్థులు కలిశారు. గ్రామీణ అభ్యర్థులకు 130కిపైగా మార్కులు వచ్చినా జాబ్ రాదని, అదే హైదరాబాద్ జిల్లా అభ్యర్థులకు 80 మార్కులు వచ్చినా వస్తుందన్నారు. హైదరాబాద్ జిల్లాలోనే 53శాతం రెండు వేలకు పైగా ఉద్యోగాలున్నాయన్నారు. 2016, 2018 నోటిఫికేషన్ల ఆధారంగానే పోలీస్ నియామకాలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.