- ఆయనను గద్దె దించమని వేడుకుంటున్నా
- రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం ప్రాజెక్టులు కట్టారు
- ఆయన డిజైన్లతోనే వరదలు
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్
హైదరాబాద్ : కేసీఆర్ భద్రాద్రి రాముడిని కూడా మోసం చేశాడని, మోసం చేస్తున్న కేసీఆర్ ని గద్దె దించేలా చూడమని రాముడ్ని మొక్కుతున్నాని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా హాల్ లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టులు సాంకేతికతో కాకుండా రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం కట్టారన్నారు. కేసీఆర్ రాత్రి పూట డిజైన్ చేసి మూడు చెక్ డ్యాంలకు ప్లాన్ గీశాడన్నారు. అడ్డగోలుగా చెక్ డ్యాం లు కట్టడం వల్లే ఇంత ప్రమాదం జరుగుతోందన్నారు. కేసీఆర్ డిజైన్లతోనే ప్రజలు మునుగుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు ఇంజనీర్ కేసీఆరేనన్నారు. రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రాలకు ప్రత్యేక విమానాలు పంపి, నాయకులను రప్పించుకొని కండువాలు కప్పుతారని, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఒక్క హెలికాప్టర్ ఇవ్వండి అంటే మాత్రం స్పందించరని విమర్శించారు. ప్రజలను మోసం చేయడం కేసీఆర్ కి అలవాటయిందని మండిపడ్డారు. వరద ప్రాంతాలకు అధికారులను పంపి నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని డిమాండ్ చేశారు