టాస్ తో తేలిన ఫలితం: TRS విజయం

టాస్ తో తేలిన ఫలితం: TRS విజయం

4, 2 0 : కౌంటింగ్ లో రౌండ్ రౌండ్ కి టెన్షన్ టెన్షన్

యాదాద్రి భువనగిరి : MPTC ఎన్నికల కౌంటింగ్ లో సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంఘటన భువనగిరిలో జరిగింది. మండలంలోని వీరవెల్లి MPTC (TRS అభ్యర్థి) ఫస్ట్ 4 ఓట్లతో గెలిచాడు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి రీ కౌంటింగ్ చేయాలని ఎన్నికల అధికారులను కోరగా.. రీకౌంటింగ్ లో 2 ఓట్లు ఎక్కువగా TRS అభ్యర్థికి వచ్చాయి. మరోసారి లెక్కించాల్సిందిగా కాంగ్రెస్ కోరింది. దీంతో ఇరు వర్గాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఫలితం కోసం దాదాపు 3 గంటల పాటు పార్టీల నేతలు,3 గ్రామాల ప్రజలు ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూశారు.

లంచ్ సమయం ముగిశాక మూడోసారి రీ కౌటింగ్ చేసిన ఎన్నికల అధికారులు.. ఇద్దరికీ సమానం ఓట్లు వచ్చాయని తెలిపారు. దీంతో అధికారులు సమాలోచన చేశారు. టాస్ తో ఫలితాన్ని నిర్ణయించగా..విజయం సాధించారు TRS అభ్యర్థి కంచి లలిత మల్లయ్య. చివరివరకు క్రికెట్ ఫైనల్ లాగా నువ్వానేనా అనేలా ఊరించిన విజయం TRSను వరించింది.  అయితే ఎలాంటి రాజకీయ అనుభవం లేని కుర్ర అభ్యర్థి( కాంగ్రెస్) నల్ల లహరి రమేష్ గట్టిపోటీ ఇవ్వడంతో ఈ విజయం నైతిక విజయంలాగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.