కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరు : భూపతిరెడ్డి

కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరు : భూపతిరెడ్డి

నిజామాబాద్​రూరల్, వెలుగు :  అధికార పార్టీ లీడర్లు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్​విజయాన్ని అడ్డుకోలేరని మాజీ ఎమ్మెల్సీ, రూరల్​ నియోజకవర్గ పార్టీ​అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్​ మండలం గుండారం, పాంగ్రా, ఆర్యానగర్, బోర్గాం, బ్యాంక్​ కాలనీల్లో ప్రచారం నిర్వహించారు.

భూపతిరెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ నాయకులు ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తూ, ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. అధికార బలంతో ప్రత్యర్థులపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్​రెడ్డి, లీడర్లు ముప్ప గంగారెడ్డి, శేఖర్​గౌడ్, యాదగిరి, రాజేందర్​పాల్గొన్నారు.