మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం

మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం


బిహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో నూడుల్స్ ఫ్యాక్టరీ ప్రమాదం జరిగింది. ఉదయం 10గంటల సమయంలో... బాయిలర్ పేలడంతో ఆరుగురు కార్మికులు చనిపోయారు. ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడగా... వారిని హాస్పిటల్ కు షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పేలుడు శబ్ధం కిలోమీటర్ వరకు వినిపించిందని స్థానికులు చెప్పారు. శబ్ధం వినపడగానే... వందలాది మంది స్థానిక ప్రజలు ఫ్యాక్టరీ దగ్గరకు పరుగెత్తారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్... మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.