బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి కొవిడ్ బారినపడ్డారు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ మేరకు బీహార్ సీఎంఓ వర్గాలు ఓ ప్రకటన జారీ చేశాయి. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ కరోనా టెస్టు చేయించుకోవాలని నితీశ్ కుమార్ కోరారు. కొవిడ్ సోకిన కారణంగానే నితీశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి హాజరుకాలేకపోయినట్లు తెలుస్తోంది.
Bihar Chief Minister Nitish Kumar tests positive for #COVID19, he has been suffering from fever for the past four days.
— ANI (@ANI) July 26, 2022
(File photo) pic.twitter.com/EnNqsGVGWd
ఈ ఏడాది జనవరిలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు తొలిసారి కరోనా సోకింది. ఆయనతో పాటు ఇంట్లో ఉన్న 11 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. అప్పట్లో వైద్యుల సూచనల మేరకు ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు.