భాగల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో ప్రయాణికులు

భాగల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో ప్రయాణికులు

బీహార్‌లోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనతో స్టేషన్ లో కాసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. రైల్వే స్టేషన్‌లోని వీఐపీ గెస్ట్‌రూమ్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పగా.. ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం గురించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

ఈ అగ్నిప్రమాద ఘటనప స్పందించిన భాగల్‌పూర్ రైల్వే స్టేషన్ అధికారి సతేంద్ర కుమార్.. జూన్ 11న మధ్యాహ్నం 12:20 గంటలకు మంటలు చెలరేగాయని చెప్పారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు  తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా తెలియరాలేదని చెప్పారు.

https://twitter.com/ANI/status/1667829590658781185