గోదావరిఖని: మద్యం మత్తులో బీహార్ గ్యాంగ్ వీరంగం సృష్టించింది. గోదావరిఖని సమీపంలో.. గోదావరి నదిపై ఉన్న వంతెనపై చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేశారు బీహార్ కు చెందిన వ్యక్తులు. సింగరేణి ఓసిపి కాంట్రాక్టు సంస్థలో పని చేస్తున్న బీహార్ కు చెందిన ఐదుగురు యువకులు కారులో మంచిర్యాలకు వెళ్లారు. తిరిగి వస్తూ నస్పూర్ దగ్గర రెండు వాహనాలను డీకొట్టారు.
గోదావరి వంతెన దగ్గర పోలీసులు వీరి వాహనాన్ని ఆపి ఎటు వెళుతున్నారని ప్రశ్నించగా.. ఐదుగురు బీహారీలు రాళ్లు కర్రలతో పోలీసులపై దాడి చేశారు. దీంతో ఒక ASI, ఇద్దరు కానిస్టేబుల్స్, ఇద్దరు డిస్టిక్ గార్డులకు స్వల్ప గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ బీహారీలను గోదావరిఖని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.