యువకుడ్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి

యువకుడ్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి

పాట్నా: అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా బలవంతపు పెళ్లి చేసిన ఘటనల గురించి వినుంటారు. కానీ ఇక్కడో యువకుడికి ఇష్టం లేకపోయినా అతడ్ని బలవంతపెట్టి యువతి వివాహం చేసుకుంది. అది కూడా యువకుడ్ని కిడ్నాప్ చేసి మ్యారేజ్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన బిహార్‌లోని పాట్నాలో జరిగింది. సుశీల్ కుమార్ (19) అనే యువకుడిది శివ్‌చాక్ గ్రామం. సోమవారం అతడు దగ్గర్లోని దేవ్రాసుఖి గ్రామానికి సోదరుడు శైలేష్ కుమార్‌తో కలసి బైక్‌పై వెళ్తున్నాడు. ఆ సమయంలో అటువైపుగా బొలెరో కారు హఠాత్తుగా దూసుకొచ్చింది. అందులో వచ్చిన వారు సుశీల్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే సుశీల్ కుటుంబీకులకు సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు సుశీల్ జాడను కనుగొనేందుకు గాలింపు చేపట్టారు. నలందా జిల్లాలోని హిస్లా ప్రాంతంలోని ఓ ఆలయంలో సుశీల్‌ ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి సుశీల్‌ను రక్షించారు. అయితే అప్పటికే సుశీల్ పెళ్లి తంతు పూర్తవ్వడం గమనార్హం. సుశీల్‌ను కిడ్నాప్ చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.