భద్రాద్రికొత్తగూడెం/ పాల్వంచ, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించని వారి నుంచి నాట్ విల్లింగ్ పత్రాలు తీసుకోవాలని, పూర్తైన ఇండ్లకు బిల్లులు చెల్లించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులకు సూచించారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో గృహ నిర్మాణ శాఖాధికారులతో బుధవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆయన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్ కలిసి మాట్లాడారు.
మొదటి విడతలో మిగిలిపోయిన 199 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వంచ పట్టణంలో వివిధ డివిజన్లలో పర్యటించారు. రోడ్లపై మిషన్ భగీరథ పైప్లైన్ల పేరిటి గుంతలు తీసి వదిలేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
