భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం సమస్త నదీజలాలు, ఆవుపాలు, నెయ్యి, పెరుగు, తేనె, పంచదారలతో అభిషేకం, స్నపన తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. ప్రత్యేక అలంకరణలు చేసి బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు.
హారతులు సమర్పించారు. బేడా మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం నిర్వహించారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ రామయ్యను దర్శించుకుని పూజలు చేశారు. హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావు– పద్మప్రియ దంపతులు నిత్యాన్నదానానికి రూ.1లక్ష విరాళం ఇచ్చారు. కరీంనగర్కు చెందిన విరాజ్ మార్కెటింగ్ కంపెనీ స్వామివారి ప్రసాదాల తయారీకి రాతి, వెండి గిన్నెలను విరాళంగా అందజేశారు.
