భద్రాచలం,వెలుగు: ఏరు ఉత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి భద్రాచలంలో పవిత్ర గోదావరికి హారతిని పురోహితులు అందించారు. వరద శాంతించి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని పూజలు చేశారు.
పురోహితులు రామావఝుల రవికుమార్శర్మ ఆధ్వర్యంలో నది అష్టోత్తర శతనామార్చన చేసి, రామయ్యకు ముందుగా హారతి ఇచ్చి తర్వాత గోదావరికి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవంలో డీఎస్పీ అరుణ్కుమార్ పాల్గొని పూజలు చేశారు.
