బిట్​ బ్యాంక్​..నీటిపారుదల ప్రాజెక్టులు

బిట్​ బ్యాంక్​..నీటిపారుదల ప్రాజెక్టులు

 

  •     శ్రీరాం సాగర్ ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మించారు. 
  •     శ్రీరాం సాగర్ పనులు 1963లో ప్రారంభించారు. 
  •     తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు శ్రీరాంసాగర్.
  •     సరస్వతి కాలువ శ్రీరాం సాగర్ ​ ప్రాజెక్టు నుంచి ప్రారంభమవుతుంది. 
  •     ప్రియదర్శిని ప్రాజెక్టు గద్వాల జిల్లాలో ఉంది. 
  •     జూరాల ప్రాజెక్టు 1995లో పూర్తయింది. 
  •     తెలంగాణలో అత్యధిక బ్లాకులు కలిగిన ప్రాజెక్టు జూరాల. 
  •     రామగుండం థర్మల్​ పవర్​ ప్రాజెక్టుకు శ్రీరాం సాగర్ నుంచి నీటిని సరఫరా చేస్తారు. 
  •     తెలంగాణలో అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ కాకతీయ కాలువ. 
  •     నల్ల సోమునాద్రి కాలువ జూరాల ప్రాజెక్టు నుంచి ప్రారంభమవుతుంది. 
  •     నిజాంసాగర్​ ప్రాజెక్టు మంజీరా నదిపై ఉంది. 
  •     నిజాంసాగర్​ నిర్మాణం 1923లో ప్రారంభమైంది. ​ 
  •     కాకతీయ కాలువ శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి మొదలవుతుంది.
  •     శ్రీరాంసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు.
  •     లోయర్​ మానేరు డ్యాం కరీంనగర్ జిల్లాలో ఉంది. 
  •      శ్రీపాద సాగర్​ ప్రాజెక్టు గోదావరి నదిపై ఉంది. 
  •     సుందిళ్ల ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లాలో ఉంది. 
  •     అన్నారం బ్యారేజీ భూపాలపల్లి జిల్లాలో ఉంది. 
  •     చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లాలో ఉంది. 
  •     సీతారామ ప్రాజెక్టు ములుగు జిల్లాలో ఉంది. 
  •     నక్కల గండి ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలో ఉంది. 
  •     ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలో ఉంది.
  •     ఘన్​పూర్​ ప్రాజెక్టు మంజీర నదిపై ఉంది.
  •     అసిఫ్​ నగర్​ ప్రాజెక్టు మూసీ నదిపై యాదాద్రి జిల్లాలో ఉంది. 
  •     పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్​, వట్టెం, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టులు భాగం.
  •     భక్తరామదాసు ప్రాజెక్టు పాలేరు నదిపై ఉంది.
  •     బయ్యారం చెరువు మహబూబాబాద్​ జిల్లాలో ఉంది. 
  •     పాకాల చెరువు వరంగల్​ జిల్లాలో ఉంది.
  •     లక్నవరం సరస్సు ములుగు జిల్లాలో ఉంది. 
  •     మోడికుంట వాగు ప్రాజెక్టు ములుగు జిల్లాలో ఉంది.
  •     రామప్ప సరస్సు ములుగు జిల్లాలో ఉంది.
  •     చెలిమెల వాగు ప్రాజెక్టు ఆసిఫాబాద్​ జిల్లాలో ఉంది.
  •     మీర్ ఆలం చెరువు హైదరాబాద్​ జిల్లాలో ఉంది. 
  •     మేడిగడ్డ బ్యారేజ్​ గోదావరి నదిపై భూపాలపల్లి జిల్లాలో నిర్మించారు. 
  •     ఉస్మాన్​ సాగర్ ప్రాజెక్టును మూసీ నదిపై నిర్మించారు.
  •     భూమిపై స్వర్గాన్ని చూడాలంటే వెన్నెల రాత్రుల్లో ఈ చెరువును చూడాలి అని లోకోక్తి కలిగిన చెరువు పాకాల చెరువు. 
  •     మిషన్ కాకతీయ పథకం నినాదం మన ఊరు – మన చెరువు.
  •     నిర్మల్​ పట్టణానికి తాగునీటి వసతి కల్పించే ప్రాజెక్టు స్వర్ణ. 
  •     ఆంధ్రప్రదేశ్​ – తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు పులిచింతల.
  •     గొల్లవాగు ప్రాజెక్టు మంచిర్యాల జిల్లాలో ఉంది.
  •     వట్టివాగు ప్రాజెక్టు ఆసిఫాబాద్​ జిల్లాలో ఉంది.
  •     మిడ్​ మానేరు ప్రాజెక్టు సిరిసిల్ల జిల్లాలో ఉంది. 
  •     మల్లన్న సాగర్​ ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలో ఉంది.
  •     పాములపర్తి బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​ సిద్దిపేట జిల్లాలో ఉంది.
  •     ఎగువ మానేరు ప్రాజెక్టు సిరిసిల్ల జిల్లాలో ఉంది. 
  •     తాలిపేరు వాగు ప్రాజెక్టు కొత్తగూడెం జిల్లాలో ఉంది.
  •     గొల్లవాగు ప్రాజెక్టు మంచిర్యాల జిల్లాలో ఉంది.
  •     వైరా ప్రాజెక్ట్​ ఖమ్మం జిల్లాలో ఉంది.
  •     కోటిపల్లి వాగు ప్రాజెక్టు కాగ్నా నదిపై ఉంది.
  •     తుపాకుల గూడెం ప్రాజెక్టుకు కంతనపల్లి సుజల స్రవంతి అనే మరో పేరు ఉంది.
  •     లెండి ప్రాజెక్ట్ మహారాష్ట్రలో నిర్మించారు. 
  •     మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం కల్వకుర్తి ప్రాంతంలో నిర్మించారు. 
  •     కాకతీయ కాలువ మొత్తం పొడవు 284 కి.మీ.
  •  శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు 1963, జనవరి 26న జవహర్​లాల్​ నెహ్రూ శంకుస్థాపన చేశారు.