కాంగ్రెస్, ఇండియా కూటమి అంటే ఎన్డీయే భయపడుతోంది: డీకే శివకుమార్

కాంగ్రెస్, ఇండియా కూటమి అంటే ఎన్డీయే భయపడుతోంది: డీకే శివకుమార్

కాంగ్రెస్, ఇండియా కూటమి అంటే ఎన్డీయే భయపడుతోందన్నారు కర్ణాటక పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.  కాంగ్రెస్‌కు ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసుపై ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై మండిపడ్డారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం, చట్టం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించి ఈ విధమైన చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. 

ఇండియా కూటమిని చూసి బీజేపీ సర్కార్ భయపడుతుందని.. అందుకే దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుందని ఆరోపించారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి NDAని ఓడించబోతోందన్నారు. ఈ విషయం బీజేపీకి అర్థమైందని.. ఎన్నికల్లో ఓడిపోతామని తెలుసు.. అందుకే ప్రతిపక్షాలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఫైరయ్యారు. నిన్న రాత్రి తనకు కూడా ఐటీ నోటీసులు అందాయన్నారు. ఇప్పటికే పరిష్కారమైన విషయంలో తనకు IT నుండి నోటీసు వచ్చిందని తెలిపారు.