అత్తగారి ఊరికి న్యాయం చేయలేని వాడు.. రాష్ట్రానికి న్యాయం చేస్తాడా?

అత్తగారి ఊరికి న్యాయం చేయలేని వాడు.. రాష్ట్రానికి న్యాయం చేస్తాడా?

మిడ్ మానేరు నిర్వాసితులకు బీజేపీ అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  మే 3వ తేదీ బుధవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటించారు. ఇందులో భాగంగా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో మిడ్ మానేరు నిర్వాసితులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్ అత్తగారు ఊరు నిర్వాసిత గ్రామమే..అత్తగారి ఊరికి న్యాయం చేయలేని వాడు.. రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? అని ప్రశ్నించారు. అన్ని దేవాలయాలకు వెళ్ళడం.. ఒట్టు వేయడం కేసీఆర్ కు కామన్ అయిపోయిందన్నారు బండి. 

సీఎం కేసీఆర్ చెల్లని చెక్కు అని చెప్పిన సంజయ్..వేములవాడ రాజన్న సాక్షిగా నిర్వాసితులు రూ.5 లక్షల 4 ఇస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. నిర్వాసితులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. ముంపు గ్రామాలను కలిపి ఇండస్త్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ప్రతిపాదనలు పంపిస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు.

మిడ్ మానేరు నిర్వాసితులకు సంబంధించిన గెజిట్ లో మిస్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సంజయ్. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చామని మాత్రమే తాము అడుగుతున్నామని..కొత్తగా ఏమీ అడగడం లేదని చెప్పారు. నిర్వాసితుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని తెలిపారు బండి సంజయ్.  నిర్వాసితుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం కోసం బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు బండి సంజయ్.