ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు పంచిపెడుతున్నారు : చెరుపల్లి వెంకట్​రెడ్డి

ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు పంచిపెడుతున్నారు :  చెరుపల్లి వెంకట్​రెడ్డి

చీకటి జీవోలతో తన అనుచరులకు  మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తున్నారని బడంగ్​పేట్​ కార్పొరేషన్​బీజేపీ అధ్యక్షుడు చెరుపల్లి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అప్పటి సర్పంచ్, ప్రస్తుత బీఆర్ఎస్ కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ తన సమీప బంధువుల పేరుతో ప్రభుత్వ భూములను కొల్లగొట్టారన్నారు. 

బడంగ్ పేట్ కార్పొరేషన్ దావఖాన్ గూడ సర్వే నెంబర్ 2 మెయిన్ రోడ్డులో ఉన్న దళితుల భూములను మంత్రి అనుచరులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆ భూమినే నమ్ముకుని ఉన్న దళితులు తమకు న్యాయం చేయాలని పోరాడితే పోలీసులు అరెస్ట్​ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. 

దళితులను దగా చేస్తే వారి జీవితం ఎలా బాగుపడతారని  వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. చీకటి జీఓలను అడ్డుపెట్టుకొని మంత్రి తన అనుచరులకు,  ప్రభుత్వ భూమిని కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమని ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. భూముల విషయంలో దళితులకు న్యాయం చేయాలని, వారికి బీజేపీ అండగా నిలుస్తుందని అన్నారు.