హైదరాబాద్, వెలుగు: ఒకే ఇంటి నంబర్తో వేర్వేరు పోలింగ్ బూత్లు, వేర్వేరు నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లు నమోదయ్యాయని బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. శుక్ర వారం సీఈవో వికాస్రాజ్ను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శృతి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తదితరులు కలిశారు. బోగస్ ఓట్లును తొలగించాలని కోరారు.
నియోజకవర్గాల వారీగా బూత్ లెవల్లో ఫీల్డ్ లెవల్లో వెరిఫికేషన్ నిర్వహించి బోగస్ ఓట్లు రిపీట్ కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు 33 నియోజకవర్గాల్లో నమోదైన బోగస్ ఓటర్ల లిస్ట్ ఇచ్చారు.