అసెంబ్లీ స్పీకర్​ ​గడ్డం ప్రసాద్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

అసెంబ్లీ స్పీకర్​ ​గడ్డం ప్రసాద్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌పై బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం సీఈవో వికాస్ రాజ్‌‌‌‌ను బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి కలిసి కంప్లయింట్​లెటర్​ను అందించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్‌‌‌‌గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారని వెల్లడించారు. స్పీకర్ ప్రచారం చేసిన ఆడియో, వీడియో రికార్డింగులను సీఈవో వికాస్ రాజ్‌‌‌‌కు అందించినట్టు వివరించారు.