మమత సర్కారును డిస్మిస్‌‌‌‌‌‌‌‌ చేయండి

మమత సర్కారును డిస్మిస్‌‌‌‌‌‌‌‌ చేయండి

న్యూఢిల్లీ: బెంగాల్ లో రాజకీయ హత్యలకు పాల్పడుతున్న తృణమూల్ కాంగ్రెస్ సర్కారును డిస్మిస్‌‌‌‌‌‌‌‌ చేయాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను బీజేపీ కోరింది. మంగళవారం బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్ వర్గీయ, ఎంపీ రాజు బిస్తా, రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్ గుప్తా తదితరులు రాష్ట్రపతిని కలిసి మమత సర్కారుపై ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే మృతి నేపథ్యంలో నేతలంతా ప్రెసిడెంట్ను కలిసి..రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. “బెంగాల్ లో డెమోక్రసీని ఉరివేస్తున్నారు. ఇదివరకు మా కార్యకర్తలను హత్యచేసేవారు. ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధులనే చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదు. అసెంబ్లీని డిజాల్వ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం”అని విజయవర్గీయ అన్నారు. మూడేళ్లలో తమ పార్టీకి చెందిన 105 మందికిపైగా నాయకులు, కార్యకర్తలను హత్య చేసినట్లు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు మమత సర్కారు పోలీసులు , ఇతర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీ నేత దేవేంద్రనాథ్ రేది హత్యేనని, దీనిని సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఉరి వల్లే చనిపోయారు: పోస్ట్ మార్టం రిపోర్ట్
ఉరి వేసుకోవడం వల్లే బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర నాథ్ రే చనిపోయారని పోస్ట్ మార్టం రిపోర్ట్ పేర్కొంది. బాడీపై ఎలాంటి గాయాలు లేవని తెలిపింది. సోమవారం బిందాల్ గ్రామంలోని ఇంటి దగ్గర ఓ షాపు బయట సీలింగ్ కు వేలాడుతూ ఆయన డెడ్ బాడీ దొరికింది. తన చావుకు ఇద్దరు కారణమని సూసైడ్ నోట్ లో ఆయన రాసినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు పోస్ట్మార్టం రిపోర్ట్పై తమకు నమ్మకం లేదని బీజేపీ నేతలు చెప్పారు.

For More News..

ప్రభుత్వానికి ఇంత అహంకారమా?