ఆప్ సర్కార్ తో మార్పు : మనీష్ సిసోడియా

ఆప్ సర్కార్ తో మార్పు : మనీష్ సిసోడియా

గత 15 ఏళ్ల పాలనలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలకు సేవలందించటంలో బీజేపీ ఫెయిలైందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. మార్కెట్లు, కాలనీల్లో పరిస్థితి మారలేదన్నారు. ఆప్ సర్కార్ వచ్చాక స్కూళ్లు, హాస్పిటళ్లలో మార్పు తెచ్చిందన్నారు. ఢిల్లీ కార్పొరేషన్ లో ఎంత ఎక్కువగా ఓటింగ్ జరిగితే అంత బీజేపీపై జనంలో ఉన్న ఆవేశం బయట పడుతుందని సిసోడియా తెలిపారు.