అస్సాం, బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అస్సాంలో 17 మంది, బెంగాల్ లో మూడో విడతలో 27, నాలుగో విడతకు సంబంధించి 36 మంది అభ్యర్థులను అనౌన్స్ చేసింది. కేరళలో 112 మంది, తమిళనాడులో 17 మంది అభ్యర్థులను ప్రకటించారు. తమిళనాడుకు సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు L మురుగన్ ధర్మపుర్ నుంచి, సినీ నటి కుష్బూ ...థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కేరళలో మెట్రో మ్యాన్ శ్రీధరన్ పాలక్కడ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ మంజేశ్వర్ రెండు చోట్ల పోటీ చేయనున్నారు. కేంద్ర మాజీ మంత్రి KJ ఆల్ఫాన్స్ ...కంజీరాపల్లి నుంచి, సినీ నటుడు సురేష్ గోపి త్రిస్సూర్ నుంచి, మాజీ డీజీపీ జాకోబ్ థామర్ ఇరింజలకుడా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.