ఫ్లెక్సీ వార్..బీజేపీకి 50వేల ఫైన్

ఫ్లెక్సీ వార్..బీజేపీకి 50వేల ఫైన్

హైదరాబాద్ లో ప్లెక్సీల వార్ నడుస్తోంది. బీజేపీ , టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ప్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల క్రితం బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. నాంపల్లిలోని ఆఫీసు వద్ద సాలు దొర..సెలవు దొర అంటూ బీజేపీ డిజిటల్ అడ్వర్టైజ్ మెంట్ ఏర్పాటు చేసింది. అయితే దీనిపై బీజేపీకి జీహెచ్ఎంసీ 50 వేల ఫైన్ వేసింది. 

ఇక బీజేపీకి కౌంటర్ ఎటాక్ చేస్తోంది టీఆర్ఎస్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ మోడీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. జూలై 3న పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగస సభ నిర్వహిస్తోంది. దీంతో మోడీకి వ్యతిరేకంగా హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తోంది టీఆర్ఎస్. ఇక ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాలు, మోడీ సభ ప్రచారానికి టీఆర్ఎస్ చెక్ పెట్టింది.  కేసీఆర్ ఫ్లెక్సీలతో హైదరాబాద్ గులాబీమయంగా మారిపోయింది. సిటీలోని  హార్డింగ్స్, మెట్రో  పిల్లర్స్ ను కేసీఆర్ ఫోటోలతో నింపేసింది టీఆర్ఎస్. ఇటు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయ్.