తెలంగాణలో  వచ్చేది బీజేపీ సర్కారే :  పొంగులేటి సుధాకర్​రెడ్డి

తెలంగాణలో  వచ్చేది బీజేపీ సర్కారే :  పొంగులేటి సుధాకర్​రెడ్డి

వైరా, వెలుగు: రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్​రెడ్డి చెప్పారు. దొంగ మాటలు చెప్పే సీఎం కేసీఆర్ ని, ఉత్తిత్తి హామీలిచ్చే కాంగ్రెస్ ను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. శుక్రవారం ఆయన వైరా మున్సిపాలిటీ రెండో వార్డులో నిర్వహించిన సేవా పక్వాడ, బూత్ స్వశక్తీకరన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బూత్ కమిటీలను పటిష్టం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, జిల్లా ఇన్​చార్జ్​కలవలపు త్రిలోకేశ్వర్, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డితో కలిసి కమిటీ సభ్యుల వివరాలను పరిశీలించారు. పొంగులేటి వెంట వైరా అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు నున్న రవికుమార్, శ్యామ్ సుందర్​ నాయక్, ఇతర నాయకులు ఉన్నారు.