మెదక్ టౌన్, వెలుగు: ఓట్ చోరీ.. సీట్ చోరీ కాంగ్రెస్కే చెల్లుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఓటరు జాబితా సవరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రీలాగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. ఆదివారం మెదక్లో బీజేపీ జిల్లా ఆఫీస్లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
70 ఏళ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని కేవలం 12 ఏండ్లలో చేయడంతో కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శించారు. మోదీ, బీజేపీ పాలనలో ప్రజలు ఎంతో ఆనందంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారని తెలిపారు. దేశ ప్రజలంతా కాంగ్రెస్ ముక్త్ భారత్ను కోరుకుంటున్నారని, రాబోయే పదేళ్లు ఎన్డీఏ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
మోదీని రాజీనామా చేయాలని అంటున్న సీఎం రేవంత్ రెడ్డికి చేతనైతే ముందుగా అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడుమల్లేశ్గౌడ్, గడ్డం శ్రీనివాస్, ఈర్ల రంజిత్ రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.
