
కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. ఆరాష్ట్రంలో పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలపై బీజేపీ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై రూ.3లు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టాలని జూన్ 5 బీజేపీ పార్టీ నిర్ణయించుకుంది. సోమవారం నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న శివమొగ్గలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎంబీ భానుప్రకాష్ గుండెపోటుతో మరణించారు. భానుప్రకాష్ (69) గతంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. శివమొగ్గలో జరిగిన నిరసన కార్యక్రమానికి ఆయన నాయకత్వం వహించి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. భానుప్రకాష్ కారులో ఎక్కుతుండగా గుండెపోటు వచ్చిందని.. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారని పోలీసులు తెలిపారు.