- దమ్ముంటే కరీంనగర్లో పోటీ చేసి గెలువు
హైదరాబాద్, వెలుగు: బీజేపీపై అబాండాలు వేస్తే, బండి సంజయ్ని తిడితే లీడర్ కావని మంత్రి పొన్నం ప్రభాకర్కు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ సూచించారు. ప్రజలకు సేవ చేస్తేనే లీడర్అవుతారని, తమ నాయకులపై అవాకులుచెవాకులుపేలితే ఊరుకోబోమని, మాట అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దమ్ముంటే కరీంనగర్ లో పోటీచేసి గెలవాలని ఆమె సవాల్ విసిరారు.
గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రకాశ్ రెడ్డి, కుమార్, విఠల్ తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ అవినీతిపరుడు కాదని కిషన్ రెడ్డి చెప్పగలరా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నిస్తున్నారని.. బండి సంజయ్ అవినీతి పరుడైతే.. బీజేపీ అధిష్టానం అతన్ని జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎట్లా చేస్తుందని ఆమె ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పైసలు వసూలు చేయలేదని సర్టిఫికెట్ తేవాలని, రవాణాశాఖలో అవినీతి లేకుండానే బదిలీలు జరిగాయని సీఎం నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని డిమాండ్ చేశారు.