చేరికల కమిటీతో నేడు తరుణ్ చుగ్ మీటింగ్

చేరికల కమిటీతో నేడు తరుణ్ చుగ్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్ శుక్రవారం రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు బీజేపీ స్టేట్​ ప్రెసిడెండ్​ బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొంటారు. తర్వాత ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగే పార్టీ చేరికల కమిటీతో సమావేశం అవుతారు. 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే లీడర్ల లిస్ట్ పై పార్టీ నేతలతో చర్చిస్తారు. బీజేపీలో చేరే వారిలో ఎంత మందిని సంప్రదించారు.‌‌.? ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? అనేదానిపై చుగ్ కు  చేరికల కమిటీ వివరిస్తుంది.

అనంతరం టీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజా సమస్యల అధ్యయన కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం అవుతారు. మునుగోడులో త్వరలో ఉప ఎన్నికలు జరగనుండటంతో అక్కడ ఉన్న  సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాయంత్రం 4గంటలకు ప్రజా గోస.. బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు పార్లమెంట్ ప్రవాస్ యోజన.‌‌. కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.