బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున హుజురాబాద్ మండలం కాట్రపల్లిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అహంకారం తగ్గాలంటే.. హుజురాబాద్లో టీఆర్ఎస్ను ఓడించాలన్నారు. ఫామ్ హౌస్లో పడుకొని.. కమీషన్లు దండుకోవడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారన్నారు. టీఆర్ఎస్ ఓటుకు ఆరువేలు పంచుతుందని వివేక్ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామంటే కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి తరపున హుజురాబాద్ మండలం కాట్రపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.@Eatala_Rajender #HuzurabadWithBJP pic.twitter.com/50hsYfZ62N
— Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) October 27, 2021