యంగ్ ఇండియా రన్ లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి

యంగ్ ఇండియా రన్ లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి

స్వామి వివేకానంద స్పూర్తితో అందరూ పని చేయాలని.. ఆయన బాటలో నడవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆనాడు వివేకానందుడు చికాగోలో అందరి ముందు ధైర్యంగా మాట్లాడి.. మన దేశానికి మంచి పేరు తెచ్చారని గుర్తు చేశారు. పీఎం మోడీ కూడా వివేకానంద అడుగుజాడల్లో నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారని వివేక్ చెప్పారు. ఏదైనా అనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించేవరకు విశ్రమించొద్దని వివేకానంద చెప్పేవారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించేవరకు విశ్రమించొద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపీని అధికారంలో నిలబెట్టే బాధ్యతను బీజేపీ,బీజేవైఎం తీసుకోవాలని సూచించారు..

స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో ఎంగ్ ఇండియా మారథాన్ రన్ చేపట్టారు. రాణిగంజ్ నుంచి వివేకనంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పలువురు బీజేపీ నాయకులతో కలిసి ఈ రన్ లో పాల్గొన్నారు.