
భవిష్యత్తు బాగుండాలంటే ప్రధాని మోడీని మళ్లీ గెలిపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి కోరారు. ఆయన ఇవాళ జగిత్యాల జిల్లాలో వెల్గటూర్, తిమ్మపూర్ లలో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 9 ఏండ్లుగా రాష్ట్రాన్ని దోచుకుని.. ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకు వెళ్తున్న కేసీఆర్ ను గద్దె దింపాలని అప్పుడే ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకుండా.. కరెంట్ ఛార్జీలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రాష్ట్రాన్ని దోచుకుంటుందని మండిపడ్డారు.